భువనేశ్వర్: ఒక యువకుడు రైలు పట్టాలపై రీల్ చేశాడు. వేగంగా వచ్చిన రైలు అతడ్ని ఢీకొట్టింది. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Teen Filming Reel Killed By Train) ఒడిశాలోని పూరీలో ఈ సంఘటన జరిగింది. మంగళఘాట్కు చెందిన 15 ఏళ్ల విశ్వజీత్ సాహు మంగళవారం తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న అతడు జనక్దేవ్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగాడు. రైలు పట్టాల వద్ద రీల్ రికార్డ్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు సాహును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విశ్వజీత్ సాహు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాహూను రైలు ఢీకొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0
— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025
Also Read:
Children Lose Eyesight | దీపావళి రోజున ‘కార్బైడ్ గన్’తో ఆడిన పిల్లలు.. కంటి చూపు కోల్పోయిన 14 మంది
Sisters Marry Multiple Men | పలువురిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఆ తర్వాత డబ్బు, నగలతో పరార్
Engineering Student Raped | ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.. క్లాస్మేట్ అరెస్ట్