Himanta Biswa Sarma | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మండిపడ్డారు. రాహుల్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆయన చేసిన ఓ ట్వీట్ పరువు నష్టం కలిగించేదిలా ఉందని అన్నారు.
అదానీ అంశంపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)తో హిమంత బిశ్వ శర్మకు సంబంధాలు ఉన్నాయని ఆ ట్వీట్లో ఆరోపించారు. ‘వాళ్లు నిజాన్ని దాచిపెట్టారు. అందుకే రోజూ తప్పుదోవ పట్టిస్తున్నారు. అదానీ కంపెనీల్లో రూ.20,000 కోట్లు బినామీ సొమ్ము ఎవరిది..? అన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలే ఉంది’ అని ట్వీట్ చేశారు. దీంతోపాటు కొందరు నాయకుల పేర్లను అదానీకి జత చేస్తూ ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. గులాం నబీ అజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత, అనిల్ కె ఆంటోనీ అనే పేర్లు రాహుల్ పోస్ట్ చేసిన చిత్రంలో కనిపించాయి.
రాహుల్ ట్వీట్పై స్పందించిన హిమంత శర్మ.. ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడబోనని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అస్సాం బోహాగ్ బిహు ఉత్సవాల కోసం సిద్ధమవుతోందని.. ఈ సమయంలో తాను దీనిపై చర్చించబోనని చెప్పారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన ముగిసిన తర్వాత గువాహటిలో రాహుల్పై కేసు దాఖలు చేస్తామన్నారు.
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్..
सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं!
सवाल वही है – अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx
— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023
Also Read..
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 35 వేల మార్క్ను దాటిన యాక్టివ్ కేసులు
Hyderabad | 30 ఏండ్ల లీజుకు ఓఆర్ఆర్.. రూ.8వేల కోట్లు వస్తాయని అంచనా
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇండ్లు, దుకాణాలు.. వీడియో