Mann Ki Baat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రాబోయే లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) దృష్ట్యా మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే మూడు నెలలు ప్రసారం కాదని మోదీ స్వయంగా వెల్లడించారు. మన్ కీ బాత్ 110 ఎపిసోడ్లో మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆదివారం ఉదయం మోదీ మాట్లాడుతూ.. ‘లోక్సభ ఎన్నికల సందర్భంగా వచ్చే మూడు నెలల పాటు మన్ కీ బాత్ ప్రసారాలు ఉండవు’ అని ప్రకటించారు. ఎన్నికల అనంతరం ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘మన్ కీ బాత్ మూడు నెలల పాటు ఆగిపోవచ్చు. కానీ దేశం సాధించిన విజయాలు మాత్రం ఆగవు. అందువల్ల మన్ కీ బాత్ హ్యాష్ట్యాగ్తో సమాజం, దేశం సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండండి’ అని తన 110 ఎపిసోడ్లో మోదీ తెలిపారు. ఎన్నికల అనంతరం 111వ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని వెల్లడించారు.
Also Read..
Alexei Navalny | గుండెపై ఒకే పంచ్.. కేజీబీ పాత పద్ధతి ద్వారా నావల్నీ హత్య..?
Alexei Navalny | ఎట్టకేలకు నావల్నీ మృతదేహం తల్లికి అప్పగింత.. మరణించిన పది రోజులకు