Alexei Navalny | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny).. సైబీరియన్ పీనల్ కాలనీ జైలు (prison)లో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి చెందిన పది రోజుల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు (Navalnys body handed). మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించినట్లు నావల్నీ సన్నిహితులు తాజాగా వెల్లడించారు. మృతదేహం అప్పగింతకై రష్యాపై ఒత్తిడి తెచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
పది రోజుల క్రితం ఆర్కిటిక్ ప్రాంతంలోని సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో నావల్నీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. నావల్నీ మరణవార్త విన్న తర్వాత .. ఆ జైలుకు ఆయన తల్లి, లాయర్ వెళ్లారు. కానీ నావల్నీ మృతదేహాన్ని చూపించేందుకు జైలు మార్చురీ అధికారులు నిరాకరించారు. పైగా మృతదేహాన్ని అక్కడే రహస్యంగా సమాధి చేయడానికి ఒప్పుకోవాల్సిందిగా ఆయన తల్లిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒత్తిడి తెస్తున్నారని నావల్నీ భార్య యూలియా ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తాజాగా నావల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించారు.
Also Read..
Indian Journalist | న్యూయార్క్లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్ట్ మృతి
Sudarshan Setu | సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్
Social Media | మరులుగొలుపుతున్న అద్దాల తెరల మాయాజాలం.. బయటపడటం ఎలా!