కొత్తగూడెం క్రైమ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. మరో 43 మంది జవాన్లు స్వల్ప గాయాలతో బయటపడగా, ఇంకో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య భీకరపోరుతో ఛత్తీస్గఢ్ లో యుద్ధ వాతావరణం నెలకొన్నది.
మొత్తం రెండు వేల మంది జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొనగా, సుమారు వెయ్యి మందితో కూడిన మావోయిస్టు గెరిల్లా ఆర్మీ గుట్టలపై నుంచి జవాన్లపై మెరుపు దాడి చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో మావోయిస్టులు మోటార్ లాంచర్లను కూడా వినియోగించినట్లు సమాచారం. ఈ ఘటనలో గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?