హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : తెలుగు అకాడమీ ముద్రించే తెలుగు పత్రికను పునఃప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రీసెర్చ్జర్నల్ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు అకాడమీ పాలకమండలి సమావేశాన్ని మంగళవారం సచివాలయంలో నిర్వహించారు.
చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, బీఆర్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వీసీలు, ఇంటర్ విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, ఇంటర్ విద్య డైరెక్టర్ అభిలాష అభినవ్, అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ భట్టు రమేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత బడ్జెట్, బకాయిలు, ఆడిట్ నివేదికలు, ధరల ర్యాటిఫికేషన్ను పూర్తిచేశారు. అకాడమీ ఆస్తులు, నిధుల విభజన అంశాలపై పునఃసమీక్షించాలని, గోదాము స్థల సేకరణకు ప్రభుత్వానికి లేఖను రాయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.