న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారి కొత్త కేసుల పెరుగుదలతో పాటు మరణాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. గడిచి 24 గంటల్లో 93,249 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా.. 513 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509కు పెరిగింది. 24 గంటల్లో 60,048 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,16,29,289 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,64,623కు పెరగ్గా.. ప్రస్తుతం దేశంలో 6,91,597 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. టీకా డైవ్లో భాగంగా ఇప్పటి వరకు 7,59,79,651 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.