ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఉదయం 47,863 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 202 పాయింట్లు కోల్పోయి 47,878 వద్ద రోజును ముగించింది. ఇక 14,326 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద రోజును ముగించింది.
అయితే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. ఎమ్ అండ్ ఎమ్, బ్రిటానియా, రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో నష్టాలను చవిచూశాయి. కరోనా లాక్డౌన్ భయాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే ఈ వారంలో ట్రేడింగ్కు చివరిరోజు కావడంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కొవిడ్ నిర్ధారణకు 6 నిమిషాల నడక పరీక్ష..!
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు