ఇంద్రవెల్లి, మే 22 : లాక్డౌన్కు ప్రజలు పూర్తి సహ కారమందించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీ బీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే కోరారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఎస్ఐ నాగ్నాథ్ ఆధ్వర్యం లో రోడ్డుపై గీయించిన కరోనా వైరస్ బొమ్మను శనివారం జడ్పీ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలు పోలీసు లకు పూర్తి సహకార మందించాలన్నారు. టీఆర్ఎస్ నాయ కులతోపాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు లాక్డౌన్ నిబంధనలు వివరించామని పేర్కొన్నారు. లాక్డౌన్ సమ యంలో ఎవరూ బయటకు రావద్దని సూచించారు. టీఆర్ ఎస్ నేత ఇనుస్ అగ్బనీ, ఎస్ఐ నాగ్నాథ్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, తదితరులు పాల్గొన్నారు.