మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మిన ఆటోడ్రైవర్కు విరాళాల వెల్లువ

ముంబై : మనవరాలి చదువు పూర్తిచేసేందుకు ఉన్న ఒక్క ఇంటినీ తెగనమ్మిన వృద్ధ ఆటో డ్రైవర్ నిబద్ధత ఆన్లైన్లో నెటిజన్ల హృదయాలను కదిలించింది. మనవరాలి చదువు పూర్తయ్యేందుకు తన వద్ద తగినంత సొమ్ము లేకపోవడంతో 74 ఏండ్ల దేశ్రాజ్ తన ఇంటిని అమ్మి టీచర్ కావాలనే మనవరాలి కల ఫలించేలా చూశాడు. ఇద్దరు కుమారులు మరణించిన తర్వాత మనవరాలి బాధ్యత తలకెత్తుకున్న దేశ్రాజ్ తపన అందరినీ కదిలిచింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజ్లో దేశ్ముఖ్ ఆకాంక్షకు నెటిజన్లు అద్దం పట్టారు. క్రౌడ్ఫండింగ్ ద్వారా రూ 24 లక్షలు సేకరించి ఆటోడ్రైవర్కు చెక్కు అందించారు. దేశ్ముఖ్ స్టోరీ వేలాది మందిని ఉద్వేగానికి లోనుచేసి వారిని నిధి సేకరణ దిశగా పురిగొల్పింది.
రూ 20 లక్షలు సేకరించాలన్నది లక్ష్యం కాగా దాతలు ఆ మొత్తాన్ని అధిగమించి వృద్ధ ఆటోడ్రైవర్కు ఆసరాగా నిలిచారు. నెటిజన్ల వితరణతో దేశ్రాజ్కు ఇల్లు కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. నెటిజన్లు స్పందించిన తీరుకు దేశ్రాజ్ కృతజ్ఞతలు తెలుపుతూ చెక్కును అంగీకరించే వీడియోను ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దేశ్రాజ్ జీకి లభించిన మద్దతు అపూర్వం..మీదైన దారిలో మీరు ఆయనకు బాసటగా నిలవడం గొప్ప విషయం..ఇప్పుడాయనకు ఓ గూడు సమకూరింది..తన మనవరాలిని చదివించుకునే స్ధోమత లభించింది. థ్యాంక్యూ సో మచ్ అంటూ హ్యూమన్స్ ఆఫ్ బాంబే రాసుకొచ్చింది.
తాజావార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..