Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. ఇప్పటికే పలు పాఠశాలలకు, కళాశాలలకు, హైకోర్టుకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నగరంలోని పలు స్కూల్స్ (Multiple schools)కు శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి.
ద్వారకా నగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS Dwarka), కష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయం సహా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాలల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఇప్పటి వరకూ జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు.
#WATCH | Multiple schools in Delhi received bomb threat calls today. Among those targeted were DPS Dwarka, Krishna Model Public School and Sarvodaya Vidyalaya. Police teams, along with bomb disposal squads, were rushed to the schools. Students and staff were safely evacuated as… pic.twitter.com/LxaF1fPpN1
— ANI (@ANI) September 20, 2025
Also Read..
Kamal Haasan | మావాళ్లు ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతారు..: కమల్ హాసన్
Tejashwi Yadav | ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే ఎన్నికలకు వెళ్తాం: తేజస్వీ యాదవ్