బెంగళూరు: తల్లిని తీసుకుని పారిపోయిన ప్రియుడిపై ఆమె కుమారుడు పగ పెంచుకున్నాడు. గ్రామానికి వచ్చిన అతడిని 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై నిల్చొని ఉన్నాడు. (Man Stabs Mother’s Lover) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బసదోని గ్రామానికి చెందిన 51 ఏళ్ల బసప్ప హోసమణి 2016లో ఒక మహిళతో కలిసి పారిపోయాడు. కొల్హాపూర్లో అతడు స్థిరపడ్డాడు.
కాగా, తల్లితో కలిసి పారిపోయిన బసప్ప హోసమణిపై ఆమె కుమారుడు ఎరయ్య మఠపతి పగ పెంచుకున్నాడు. అతడ్ని హత్య చేసేందుకు పదేళ్లుగా ఎదురుచూశాడు. అయితే బసప్ప ఇటీవల ఆ గ్రామానికి వచ్చాడు. సవదత్తి సమీపంలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఎరయ్య మఠపతి కాపుకాశాడు. రోడ్డుపై వెళ్తున్న బసప్పను బైక్తో ఢీకొట్టాడు. కత్తితో 16 సార్లు పొడిచి చంపాడు. పోలీసులు వచ్చే వరకు మృతుడి ఛాతిపై నిల్చొని ఉన్నాడు.
మరోవైపు ఈ హత్య చూసి ఆ రోడ్డుపై వెళ్లే జనం షాక్ అయ్యారు. నిందితుడు ఎరయ్య మఠపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బసప్ప మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Car Tries To Run Over Man | నగ్నంగా మారి వ్యక్తి హంగామా.. అతడిపైకి కారు దూకించేందుకు యత్నం
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్లో దాచారు