Mahindra against Corona | కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా విస్తృత స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారాన్ని అందిస్తున్నది. అందులో భాగంగా తెలంగాణకు మూడు ఆక్సిజన్ ప్లాంట్లు, 12 అంబులెన్స్లు డొనేట్ చేస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిని ప్రభుత్వ రంగ, పబ్లిక్ చారిటబుల్ దవాఖానాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి తెలంగాణలోని వృద్ధులకు అత్యవసర క్యాబ్ సర్వీసులు అందిస్తోంది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే ఇన్షియేటివ్లో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లను తెలంగాణకు సరఫరా చేస్తున్నది. ఇంకా ఫేష్ షీల్డులు, రేషన్ కిట్లు, భోజనం, ఫేస్మాస్క్లు, పీపీఈ కిట్స్, ఎరోసోల్ బాక్సెస్, దవాఖానలకు అవసరమైన ఔషధ పరికరాలను సప్లయి చేస్తోంది.
హైదరాబాద్లోని 200 పడకల సెయింట్ థెరిసా దవాఖానలో 500 ఎల్పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా మహబూబ్నగర్లో 1000 ఎల్పీఎం, పారిశ్రామిక పట్టణం జహీరాబాద్లో 500 ఎల్పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపింది.
కరోనాపై పోరులో మహీంద్రా గ్రూప్ సహకారంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మహీంద్రా గ్రూప్ సమర్థవంతంగా, చురుగ్గా పాలుపంచుకుంటున్నదని పేర్కొన్నారు. చారిటబుల్ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, అంబులెన్స్లను ఏర్పాటు చేయడంతో పేదవారు, అట్టడుగు వర్గాల వారికి అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!