ముంబై: బంధువైన వ్యక్తి ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన ఆమె విషం తాగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో బాలిక బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. (Girl Consumes Poison After Rape) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 5న 16 ఏళ్ల బాలిక గ్రామంలోని పశుశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నది. తండ్రి కుటుంబానికి చెందిన బంధువైన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, ఆ బాలిక తీవ్ర మనస్థాపం చెందింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విషం తాగింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను ఛత్రపతి సంభాజీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మరోవైపు బాలిక కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బంధువును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతడి సహచరుడ్ని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మంత్రికి తప్పిన ముప్పు.. వాహనాల పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండ్