Lok Sabha elections| దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) సమయం దగ్గరపడుతుండటంతో దేశంలోని ప్రధాన పార్టీలు సమయాత్తమవుతున్నాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు, మేని ఫెస్టో వంటి పనుల్లో బిజీగా ఉన్నాయి. కొన్ని పార్టీలైతే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి. ఇక తేదీల ప్రకటనే తరువాయి. అంతా ఈసీ ప్రకటించే ఎన్నికల షెడ్యూల్ కోసమే ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈసీ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. మార్చి 13 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని శుక్రవారం తెలిపాయి. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఈసీ బృందం.. గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసీ బృందం ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్లలో పర్యటన చేయనుంది. ఈ రాష్ట్రాల పర్యటన మార్చి 13వ తేదీలోపే ముగియనుంది. మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని సదరు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని (Artificial Intelligence technology) ఉపయోగించనున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తప్పుడు సమాచారాన్ని, అభ్యంతరకర సమాచారాన్ని తొలగించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సమాచారాన్ని తొలగించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఉంటే ఆ కంటెంట్ను ఏఐ సాయంతో వెంటనే తొలగిస్తారు. ఒక వేళ ఏదైనా రాజకీయ పార్టీ లేదా.. నాయకుడు తరచూ నిబంధనలను ఉల్లంఘించినట్టైతే.. ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. సదరు అకౌంట్ను బ్లాక్ చేయాలని ఆ సామాజిక మాధ్యమాన్ని ఆదేశిస్తుంది.
Also Read..
Rakul Preet Singh | పెళ్లి వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
Joe Biden | నావల్నీ కుటుంబాన్ని పరామర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
100 cars pile up | ఒకదానికొకటి ఢీకొన్న 100కుపైగా వాహనాలు.. పలువురికి గాయాలు