Joe Biden | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny).. సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పరామర్శించారు. కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో నావల్నీ భార్య యులియా, కుమార్తె దాశాని బైడెన్ కలిశారు (Biden meets Navalny family). ఈ సందర్భంగా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నావల్నీ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు.
కాగా, సైబీరియన్ పీనల్ కాలనీలో ఉన్న నావల్నీ.. గత శుక్రవారం మరణించినట్లు అధికారులు చెప్పారు. జైలులో వాకింగ్కు వెళ్లిన నావల్నీ కింద కూలిపడ్డారు. ఆ తర్వాత ఆయన మళ్లీ లేవలేదట. నావల్నీ మరణవార్త విన్న తర్వాత .. ఆ జైలుకు ఆయన తల్లి, లాయర్ వెళ్లారు. కానీ ఇప్పటి వరకు నావల్నీ మృతదేహాన్ని చూపించేందుకు జైలు మార్చురీ అధికారులు నిరాకరించారు.
అయితే, నావల్నీ మృతదేహాన్ని దాచిపెట్టారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. తన భర్తను అధ్యక్షుడు పుతిన్ హత్య చేశారని యులియా ఆరోపిస్తున్నారు. ఫ్రీ రష్యా ఉద్యమంపై ఆమె ఓ వీడియోను రిలీజ్చేశారు. నరాలను దెబ్బతీసే నోవిచోక్ అనే విషపూరిత ఏజెంట్ను తన భర్తపై ప్రయోగించారని, శరీరం నుంచి ఆ విషం వెళ్లే వరకు నావల్నీ పార్దీవదేహాన్ని అప్పగించబోరని యులియా ఆరోపించారు.
Also Read..
100 cars pile up | ఒకదానికొకటి ఢీకొన్న 100కుపైగా వాహనాలు.. పలువురికి గాయాలు
Zeeshan Siddique | రాహుల్ గాంధీని కలవాలనుకుంటే.. ముందు బరువు తగ్గమన్నారు : జీషాన్ సిద్ధిఖీ