Zeeshan Siddique | మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) కుమారుడు జీషాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique).. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవలే రాహుల్ గాంధీని కలవాలనుకున్నట్లు చెప్పారు. అయితే, రాహుల్ను కలవాలంటే నేను బరువు తగ్గాలని ఆయన సన్నిహితులు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మహారాష్ట్రలోని నాందేడ్కు వచ్చినప్పుడు రాహుల్తో భేటీ కావాలనుకున్నట్లు చెప్పారు. అయితే రాహుల్ను కలవాలంటే తాను 10 కేజీల వరకూ బరువు తగ్గాలని ఆయన సన్నిహితులు చెప్పినట్లు జీషాన్ వివరించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న బాబా సిద్ధిఖీ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ముంబై యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీని అదిష్ఠానం తొలగించింది.
Also Read..
Haryana police | రైతులు తమపై కారం పొడితో దాడి చేశారు.. పంజాబ్ పోలీసుల ఆరోపణలు
Ravichandran Ashwin | ఇంగ్లండ్పై అశ్విన్ మరో ఘనత.. తొలి ఆసియా క్రికెటర్గా రికార్డు
Tantra Movie | పిల్లబచ్చాలు ఈ సినిమాకు రావోద్దు.. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘తంత్ర’