Haryana police | తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో నిరసన చేపట్టిన రైతులపై పంజాబ్ పోలీసులు (Haryana police) తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఘర్షణల్లో రైతులు తమపై చెక్క కర్రలు (wooden sticks), కారంపొడి (chilli powder)తో దాడి చేశారని పోలీసులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, పంజాబ్ భూభాగంలోకి ప్రవేశించిన తమ వాహనాలను పోలీసులే ధ్వసం చేశారని అంటున్నారు. అందువల్లనే ఘర్షణ మరింత పెరిగిందని చెబుతున్నారు.
కాగా, బుధవారం రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే. ఖానౌరీ సరిహద్దులో రైతుల నిరసనలో 14 మంది పోలీసు అధికారులు, 12 మంది రైతులు గాయపడ్డారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో 22 ఏళ్ల యువ రైతు కూడా మరణించాడు. రైతు మృతితో తమ నిరసనను రైతులు రెండు రోజులు వాయిదా వేసుకున్నారు. తదుపరి కార్యాచరణ ఏంటన్నది శుక్రవారం సాయంత్రం వెల్లడిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Lasya Nanditha | ముగిసిన పోస్టుమార్టం.. సాయంత్రం అంత్యక్రియలు
Tantra Movie | పిల్లబచ్చాలు ఈ సినిమాకు రావోద్దు.. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘తంత్ర’
Punjab CM: ఆ రైతు కుటుంబానికి కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం