Nizamsagar Inflow | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం ఉదయం నాటికి 6585 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
మంగళవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. రానున్న గంటల్లో ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1395.40 అడుగులు ఉండగా.. 7.13 టీఎంసీల నేరు ఉందని వెల్లడించారు. ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారీ వర్షాలు కురుస్తూ.. ప్రాజెక్టులకు నీళ్లు వస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.