Priyanka Gandhi | కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే కేరళలోని వయనాడ్ (Wayanad) స్థానానికి జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. రెండు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ హోదాలో ప్రియాంక తొలిసారి తన నియోజకవర్గం వయనాడ్కు వెళ్లారు. సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో కలిసి శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇవాళ వయనాడ్లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో ప్రియాంక పాల్గొని ప్రసంగించనున్నారు.
#WATCH | Kerala: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi and Wayanad MP Priyanka Gandhi Vadra arrive at Calicut International Airport, Karipur; receive a warm welcome from party leaders and workers
They will jointly address a public rally in Kerala’s Wayanad today
(Source:… pic.twitter.com/nwVYEqP5xi
— ANI (@ANI) November 30, 2024
కాగా, ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజీకాయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత శనివారం వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు. ఈ క్రమంలోనే గురువారం లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. కేరళ సంప్రదాయ కసావు చీర కట్టుతో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన ప్రయాంక.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read..
Chennai Airport | ఫెంగల్ ఎఫెక్ట్.. చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేత.. ప్రయాణికుల ఇబ్బందులు
Chicago | చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
Eknath Shinde | అందుకే షిండే తన స్వగ్రామానికి వెళ్లారు : శివసేన