చెన్నై : (Tamil Nadu Day) ఇకపై జూలై 18 ని తమిళనాడు దినంగా జరుపుకోనున్నారు. వివిధ సంస్థల నుంచి అందిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం ప్రకటించారు. జూలై 18 ని తమిళనాడు దినంగా ప్రకటించాలని ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కే వీరమణి, ద్రవిడ ఇయక్క తమీజ్ పేరవై ప్రధాన కార్యదర్శి సుబా వీరపాండియన్, తమిళ పండితుడు సోలమన్ పాపయ్య నేతృత్వంలోని తమిజ్ ఉనర్వలర్గల్ కూటమైప్పు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాంతో మరుసటి రోజే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం. డీఎంకే ప్రభుత్వం నిర్ణయాన్ని ఏఐఏడీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది.
‘మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై 1967 జూలై 18 న అప్పటి మద్రాసు రాష్ట్రానికి తమిళనాడుగా పేరు మార్చారని, ఆ రోజున దీనికి సంబంధించి తీర్మానం చేశారని తమిళ పండితులు, మరికొందరు స్కాలర్స్ చెప్పారని తెలిపారు. అన్నాదురై నిర్ణయం ప్రకారం జూలై 18ని తమిళనాడు దినంగా ప్రకటించాలని తమిళ పండితులు డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సీఎం స్టాలిన్ చెప్పారు.
దీనిపై ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ ఘాటుగా స్పందించారు. ‘మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి నవంబర్ 1వ తేదీని తమిళనాడు దినంగా ప్రకటించిన విషయం మరిచిపోయి.. తమ సౌలభ్యం కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఈ విద్వేష రాజకీయాలను ఖండిస్తున్నాం. 1956 నవంబర్ 1 న భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినందున 2019లో అప్పటి అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం నవంబర్ 1 ని తమిళనాడు దినంగా ప్రకటించింది’ అని కోవై సత్యన్ చెప్పారు.
ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!
అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : వెంకయ్యనాయుడు
అవినీతి, కుంభకోణానికి పర్యాయపదం కాంగ్రెస్ : అమిత్షా
ఆ రైతులకు అండగా టీటీడీ : చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
సమాజ్వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..