అమరావతి : (Crackers @ AP) ఏపీలో దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు విధించారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది. దీపావళి పర్వదినాన రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చి పండుగ జరుపుకోవాలన్నది.
శబ్ధ కాలుష్యం లేకుండా చూడటం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే పరీడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, కరోనా మూడో వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని ప్రభుత్వం సూచించింది. రసాయనాలు ఎక్కువగా ఉండే టపాసులు కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతున్నందున, వాటికి బదులుగా గ్రీన్ కాకర్స్ తోనే పండుగ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నది.
దీపావళి రోజు వాడే ఫైర్క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రకాల బాణసంచాపై తాము పూర్తి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : వెంకయ్యనాయుడు
అవినీతి, కుంభకోణానికి పర్యాయపదం కాంగ్రెస్ : అమిత్షా
ఆ రైతులకు అండగా టీటీడీ : చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
సమాజ్వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..