అమరావతి : ఏపీలో ఎన్నికల వేడి వేడెక్కుతుంది . అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సినీరంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pitapuram Constituency) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరుఫున ఇప్పటికే పలువురు సినీ తారాలతో పాటు బుల్లితెర నటులు హైపర్ ఆది, గెటప్ సీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు ప్రచారంలో పవన్కు మద్దతుగా విస్తృతంగా పాల్గొంటున్నారు.
పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు కుమారుడు, నటుడు వరుణ్తేజ్ ( Varun Tej ) శనివారం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్ షోలో పాల్గొన్నారు.
మీడియాతో వరుణ్తేజ్ మాట్లాడుతూ బాబాయి పవన్కల్యాణ్కి అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులందరూ ప్రచారం చేస్తారని చెప్పారు. చిత్రపరిశ్రమలో (Film Industry)తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబాయి పవన్కల్యాణ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకున్నారని అన్నారు. బాబాయిపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణపై స్పందిస్తూ నిజాయితీ ముందు అవేవి నిలబడవని అన్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లు చేస్తూనే బాబాయికి తరుఫున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు.