అమరావతి : ఏపీలో అధికార పార్టీ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే కూటమి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్గా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం (Prajagalam) సభలో ఆయన ప్రసంగించారు. శనివారం ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto) లో రైతుల సంక్షేమం గురించి ఏమి లేదని ఆరోపించారు.
సీపీఎస్ (CPS) రద్దు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రస్తవించలేదని మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని పేర్కొన్న జగన్ హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేశారని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి గోదావరిలో కలిపారని వెల్లడించారు. అంశం గతంలో తమ పరిపాలన స్వర్ణయుగం కాగా వైసీపీ పాలన రాతియుగమని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్పీ పైనే ఉంటుందని పేర్కొన్నారు.