విజయవాడ: (AP Covid Cases) ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. కొత్తగా 481 మంది కేసులు చేరడంతో శుక్రవారం వరకు మొత్తం కేసుల సంఖ్య 4,837 కు చేరుకున్నాయి. కృష్ణా జిల్లాలో వరుసగా రెండో రోజు శుక్రవారం ఒక్కరే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం, తూర్పు గోదావరిలో 157 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. చిత్తూరు (76), కృష్ణ (52) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన 10 జిల్లాల్లో ఒక్కొక్కటి 50 కంటే తక్కువ కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. అనంతపురం, ప్రకాశం, కర్నూలు రోజువారీగా సింగిల్ డిజిట్ 6, 7, 8 కేసులు వస్తున్నాయి.
ఎనిమిది జిల్లాల్లో కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. మూడు ఉత్తర కోస్తా జిల్లాల్లో 75కి పైగా కొత్త కేసులు నమోదు కాగా, నాలుగు రాయలసీమ జిల్లాల్లో 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రికవరీలు 385కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,837కి పెరిగింది. తూర్పుగోదావరిలో కేసులు పెరిగిపోతుండగా.. కడపలో కేసుల సంఖ్య 100కి తగ్గడం కనిపించింది. మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటివరకు 2.94 కోట్ల నమూనాలను పరీక్షించారు. రికవరీలు 20.46 లక్షలకు పైగా ఉన్నాయి. మరణాల సంఖ్య ఇప్పుడు 14,367కి చేరుకున్నది. శుక్రవారం ఉదయం 9 గంటలతో ముగిసిన 24 గంటల్లో 39,000కు పైగా నమూనాలను పరిశీలించగా, 481 పాజిటివ్ కేసులు తేలాయి.
సమాజ్వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..