అమరావతి: (AP Assembly) ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. నవంబర్ 17వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. 6 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పొడిగించడమా? లేక కుదించడమా? అనేది త్వరలో నిర్ధారించనున్నారు. పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి అవకాశాలున్నాయి. మూడు రాజధానులపైనా కీలక నిర్ణయం తీసుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి, తేదీలు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తున్నది. నాలుగు నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రులు ప్రతిపాదించగా.. ఆరు రోజులు నిర్వహించేందుకు జగన్ మొగ్గు చూపారని సమాచారం. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుపై ఈ సమావేశాల్లో అధికార పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంటుందని భావిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటులో ఎలాంటి జాప్యం చేయకూడదని మంత్రివర్గం తీర్మానించినట్లు తెలుస్తున్నది. వెనుకబడిన తరగతుల వారిని కులాల ప్రాతిపదికన గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇలావుండగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత శాసనసభ బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. వారం రోజులుగా ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన 20 మంది అరెస్ట్
మాజీ పోలీస్ కమిషనర్పై నాన్ బెయిలబుల్ వారంట్
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..