తిరుపతి: (Tirumala E-Buses) తిరుమల ఘాట్లో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగు పెట్టనున్నాయి. తిరుమల-తిరుపతి అర్బన్ మధ్య 100 ఇ-బస్సులు, తిరుపతి-తిరుమల మార్గంలో మరో 50 నడిపేందుకు రంగం సిద్ధమైంది. తిరుపతి సమీప ప్రాంతాలైన కడప, నెల్లూరు, మదనపల్లి, చిత్తూరు, రేణిగుంట నుంచి మరో 50 ఇ-బస్సులు తిరుమలకు తిరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది.
తిరుమల శ్రీవారి క్షేత్రంలో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలన్న ప్రధాన ఉద్దేశంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రైవేటు ట్రాన్స్పోర్టర్ల నుంచి బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నడపడంపై ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తున్నది. ఎట్టకేలకు ఇ-బస్సులు రోడ్డెక్కేందుకు మార్గం సుగమం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తిరుపతి- తిరుమల తరహాలోనే విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో కూడా ఇ-బస్సులను నడపాలని ఆర్టీసీ యోచిస్తున్నట్లుగా సమాచారం.
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
వడోదరలో ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..