ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో శనివారం భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి అనంతరం కనిపించకుండా పోయిన జవాన్ రాకేశ్వర్సింగ్ ఆచూకీ లభ్యమైంది. ఆయన ప్రస్తుతం మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. జవాన్ రాకేశ్వర్సింగ్ తమ ఆధీనంలో ఉన్నాడని తాజాగా మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు వాళ్లు ఒక లేఖను విడుదల చేశారు.
అదేవిధంగా ఆ లేఖలో మావోయిస్టులు మరికొన్ని డిమాండ్లు కూడా చేశారు. ‘ఆపరేషన్ ప్రహార్-3’ పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేయడం కోసం ప్రభుత్వాలు పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని, ప్రభుత్వాలు తక్షణమే తమ చర్యలను నిలిపివేయాలని మావోలు తమ లేఖలో డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 1 నుంచి 25 వరకు దేశంలో జరిగే అన్ని ప్రజా ఉద్యమాలకు మద్దతుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26న దేశమంతటా భారత్ బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
మధుమేహం ఉన్నవారు కార్న్ఫ్లేక్స్ తినొచ్చా..?