అహ్మదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి కాలుమోపినప్పటి నుంచి కూడా ఒకేరోజు లక్షకుపైగా కొత్త కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే ప్రజల్లో చాలామంది టీకాలపై అపోహలతో వ్యాక్సినేషన్కు ముందుకు రావడంలేదు.
ఈ నేపథ్యంలో ప్రజల్లో చైత్యనం పెంచుతూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రోత్సహించేలా గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ప్రాంతంలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకునే వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకునే మహిళలకు ఉచితంగా ముక్కుపుల్ల ఇస్తామని, అదే పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే హ్యాండ్ బ్లెండర్ ఫ్రీగా ఇస్తామని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో