జోధ్పూర్: రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా మార్చారు. ఐఐటీలో ఇప్పటివరకు 65 నుంచి 70 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో క్యాంపస్లోని జీ3 బ్లాక్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు జోధ్పూర్ డిప్యూటీ సీఎంహెచ్వో పీ సింగ్ తెలిపారు. ఐఐటీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 55 నుంచి 60 కేసులు యాక్టివ్గా ఉన్నాయని చెప్పారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. మహమ్మారి బారిన పడినవారిలో చాలామంది ఛత్తీస్గఢ్, గుజరాత్, జైపూర్ నుంచి వచ్చినవారే ఉన్నారని తెలిపారు.
కాగా, నిన్న రాజస్థాన్లో 1675 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,37,596కు పెరిగింది. ఇందులో 2827 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 57,074 కేసులు రికార్డయ్యాయి. కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఒక్క ముంబైలోనే 11 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..