Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష్ శెట్టర్ (Jagadish Shettar) తాజాగా కమలం గూటికే చేరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఇతర పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
#WATCH | Former Karnataka CM Jagadish Shettar returns to BJP, meets the party’s National President JP Nadda in Delhi pic.twitter.com/YHLgECx61d
— ANI (@ANI) January 25, 2024
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు జగదీష్ శెట్టర్ బీజేపీని వీడారు. కంచుకోట అయిన హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ను బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను నిర్మించిన బీజేపీ తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని, పార్టీ నుంచి బలవంతంగా తనను వెళ్లగొట్టారని ఆ సందర్భంగా విమర్శించారు. లింగాయత్ నేతల్లో అత్యంత ప్రముఖుడైన జగదీష్ శెట్టర్, బీజేపీని వీడి ఆ పార్టీ కొంప ముంచినప్పటికీ తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో 34,000 కంటే ఎక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూశారు.
Also Read..
Tamil Nadu | అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి.. షాకింగ్ వీడియో
Ram Temple | అయోధ్య రామ మందిరానికి తొలి రోజు భారీ విరాళాలు.. ఎన్ని కోట్లంటే..?
Rahul Gandhi | అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ