ముంబై : కొవిడ్ -19 ఇన్ఫెక్షన్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఎక్కువ మందికి టీకాలు అందించేందుకు వీలైన అన్ని చర్యలు చేపడుతున్నారు. వ్యాక్సిన్ను పొందేందుకు ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా ప్రేరేపిస్తుండగా.. టీకాలు వేసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించడానికి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని కూడా తీసుకువచ్చింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ అనే ప్రత్యేక స్థిర డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కొవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి మాత్రమే. ఈ పథకం కింద టీకా పొందిన వారికి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి) పై ప్రస్తుత రేటు కంటే 0.25% ఎక్కువ వడ్డీ లభిస్తుంది. టీకా తీసుకోలేని వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు.
ఈ పథకం గురించి బ్యాంక్ సోషల్ మీడియా పోస్టులో సమాచారం పంచుకున్నది. ఈ పథకం యొక్క మ్యాచురిటీ వ్యవధి 1,111 రోజులు. పరిమిత కాలానికి కూడా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు బ్యాంక్ పేర్కొన్నది. ఈ పథకం కింద, టీకాలు తీసుకున్న సీనియర్ సిటిజన్లకు డిపాజిట్పై 0.50% ఎక్కువ వడ్డీ లభిస్తుంది. టీకాలు తీసుకోవడానికి ఎక్కువ మందిని ప్రేరేపించడానికి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు బ్యాంక్ తెలిపింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు స్థిర డిపాజిట్లను అందిస్తున్నది. దీని కింద, బ్యాంక్ 2.75 నుంచి 5.1% వరకు వడ్డీని అందిస్తుంది.
మధ్యప్రదేశ్లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
సెనేట్లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..