IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo), ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (The Ministry of Civil Aviation) షోకాజ్ నోటీసులు (show-cause notices) జారీ చేసింది. కొందరు ప్రయాణికులు విమానం పక్కన రన్వేపై కూర్చుని భోజనం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఘటనకు గానూ వివరణ కోరుతూ ఇండిగో, ముంబై ఎయిర్పోర్ట్కు తాజాగా నోటీసులు ఇచ్చింది.
పరిస్థితులను అంచనా వేయడంలో, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఇండిగో, ముంబై ఎయిర్ పోర్టు విఫలం అయినట్లు పేర్కొంది. దీనిపై మంగళవారం సాయంత్రానికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువులోపు సమాధానం ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. గత రాత్రి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఉత్తరాదిన పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబై ఎయిర్ఫోర్ట్లో దిగింది. అప్పటికే ఆలస్యమవడంతో కొందరు ప్రయాణికులు కిందకి దిగి, నేలపై కూర్చొని భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#BreakingNews Flight from #Indigo to #Goa #Delhi diverted to Mumbai due to operational issues After this, the passengers were seen sitting on the ground at #MumbaiAirport and eating food #IndigoAirlines #ViralVideo #IndigoAirlines #Aerobridge #IndiGo #MumbaiAirport #Deepfake pic.twitter.com/p0SDtPe2iZ
— Robine (@Robine07789588) January 16, 2024
Also Read..
PM Modi | లేపాక్షిలో మోదీ రామ భజన.. వీడియో
Mahesh Babu | మహేష్ బాబు ‘బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్’.. వైరలవుతున్న పిక్స్