Ankur Jain | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత సంతతికి చెందిన బిలియనర్, బిల్ట్ రివార్డ్స్ సీఈవో అంకుర్ జైన్, మాజీ డబ్ల్యుడబ్ల్యూఈ రెజ్లర్ ఎరికా హమ్మూండ్ శుక్రవారం ఈజిప్ట్లోని పిరమిడ్ల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కైరోలో అత్యంత ఆడంబరంగా జరిగిన ఈ వివాహ తంతుకు ప్రముఖ సెలబ్రిటీలు లాన్స్ బాస్, మైఖేల్ టుర్చిన్, రాబిన్ థిక్కే, షార్క్ ట్యాంక్ ఇన్వెస్టర్ కెవిన్ ఓ లీరీతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం 130 మంది హాజరైనట్టు పేజి సిక్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అతిథులు ఆఫ్రికా సఫారీ నుంచి వివాహ వేదికకు ప్రైవేట్ ఫ్లయిట్ ద్వారా చేరుకున్నారు. వాస్తవానికి 34 ఏండ్ల జైన్ తొలుత తన వివాహాన్ని అంతరిక్షంలో చేసుకోవాలని భావించారు. అయితే దీనికి ఎరికా ఆసక్తి చూపకపోవడంతో ఈజిప్ట్లో జరుపుకున్నారు.