Indian Ocean | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: 2020-2100 మధ్య హిందూ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం అంచనా వేసింది. దీని వల్ల వడగాడ్పులు, తుఫానులు తీవ్రతరం కానున్నాయని హెచ్చరించారు.
రుతు పవనాలు గతి తప్పుతాయని, సముద్ర మట్టాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పుణే ‘ఐఐటీఎం’ వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. హిందూ మహాసముద్రం వేడెక్కడం కేవలం ఉపరితలానికే పరిమితం కాలేదని, సముద్రం 2000 మీటర్ల లోతు వరకు వేడి ప్రభావం ఉంటున్నట్టు అధ్యయనం పేర్కొన్నది.