MK Stalin | కేంద్రంలోని మోదీ సర్కార్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పాడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్లో పలు అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై స్టాలిన్ నిప్పులు చెరిగారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా, ఎన్ని రకాలుగా మోసం చేసిందో అందులో వివరించారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. భారతదేశ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. భారత మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. భారతీయులు ఇంతకాలం అభిమానించిన ఐక్యతా భావాన్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. సమైక్యత వ్యవస్థనే కూల్చేందుకు కంకణం కట్టుకుంది. భారతదేశం కోసం మాట్లాడాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల్లో ఒకడినైన వ్యక్తిగా దేశం కోసం మాట్లాడాలనుకుంటున్నాను. గత 9 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీనీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. 2014లో అధికారంలోకి వస్తే ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి ప్రజలను దారుణంగా మోసం చేసింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు రైతు సమస్యలనే గాలికొదిలేసింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజలను మభ్యపెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికింది. అయితే, అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి హామీలను నెరవేర్చలేదు’ అంటూ బీజేపీ ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్ (Manipur), హర్యానా (Haryana)లో చెలరేగిన మత ఘర్షణల గురించి ప్రస్తావించారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాగా మారకుండా నిరోధించాలంటే ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ (INDIA) తప్పక గెలవాలని అన్నారు. సామాజిక న్యాయం, సమాఖ్య భావన, లౌకికవాద రాజకీయాలను పునరుద్ధరించేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు. విపక్ష కూటమి గెలవకపోతే భారతదేశాన్ని ఎవరూ రక్షించలేరని అన్నారు.
భారత్లో బడా పారిశ్రామికవేత్తలకు మేలు కలిగేలా మాత్రమే మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని స్టాలిన్ అన్నారు. భారత్లో సంక్షేమం అందరికీ అందాల్సి ఉండగా అది కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే అందుతోందని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి చెందిన ఎయిర్ఇండియాను ఇప్పుడు ప్రైవేట్ పరం చేశారు. దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి బదిలీ అవుతున్నాయి. మోదీ చెప్పినట్టు రైతుల ఆదాయం రెట్టింపు అవలేదు, పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. వీటన్నిటినీ కప్పి పుచ్చేందుకు మతవాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ పెద్దలు చోద్యం చూస్తున్నారు’ అంటూ స్టాలిన్ బీజేపీపై మండిపడ్డారు.
Also Read..
Harish Salve | 68 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న టాప్ లాయర్.. హాజరైన ప్రముఖులు
IndiGo | ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. పక్షి ఢీ కొనడంతో అత్యవసర ల్యాండింగ్
Isro Scientist | కౌంట్డౌన్ సమయంలో స్వరం వినిపించే ఇస్రో శాస్త్రవేత్త మృతి