IndiGo | ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight) పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది. దీంతో విమానాన్ని భువనేశ్వర్ (Bhubaneshwar) ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (Biju Patnaik International Airport) నుంచి ఇండిగో 6ఈ2065 విమానం సోమవారం ఉదయం 7:50 గంటల సమయంలో ఢిల్లీ బయలుదేరింది. టేకాఫ్ అయిన 20-25 నిమిషాల తర్వాత విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి తిప్పి భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే, పక్షి ఢీ కొనడంతో విమానం ఎడమవైపు ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇండిగో ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read..
Viral Video | ట్రాఫిక్ను తప్పించుకునేందుకు.. ఆటోను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కించేసిన డ్రైవర్
Isro Scientist | కౌంట్డౌన్ సమయంలో స్వరం వినిపించే ఇస్రో శాస్త్రవేత్త మృతి
Vivek Ramaswamy | నేను అధ్యక్షుడినైతే.. ట్రంప్ను క్షమిస్తా : వివేక్ రామస్వామి