న్యూఢిల్లీ: ఆహార భద్రత సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రముఖ డాబర్ కంపెనీ(Dabur Company)కి షాకిచ్చింది. ఆ కంపెనీకి చెందిన తేనే, ఆవు నెయ్యి, వంట నూనెకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసింది. 100 శాతం శుధ్ద వస్తువులని చెప్పుకుని అమ్మడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యతిరేకించింది. ఉత్పత్తులపై అలాంటి లేబుల్స్ వేయడం చట్టానికి వ్యతిరేకం అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొన్నది. భారత ఆహార భద్రతసంస్థ తన ఆదేశాల గురించి సోషల్మీడియాలో సోమవారం ఓ పోస్టు చేసింది. డాబర్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఆహార ఉత్పత్తల అమ్మకాలపై 100 శాతం లేబుల్స్తో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆ పోస్టులో తెలిపింది.
తేనె, యాపిల్ సిడర్, వెనిగర్, వర్జిన్ కోకనట్ ఆయిల్, సీసేమ్ ఆయిల్, ఆవు నెయ్యి, కోకనట్ వాటర్, కోకనట్ మిల్క్ లాంటి ఐటమ్స్పై డాబర్ కంపెనీ 100 శాతం లేబుల్స్ వేస్తోంది. ఇలా లేబుల్స్ అతికించడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తప్పుపట్టింది. 100 శాతం నేచురల్, 100 శాతం శుద్ధమైనవని, 100 శాతం ప్యూరిటీ గ్యారెంటీ, 100 శాతం ఆర్గానిక్, 100 శాతం టెండర్ కోకనట్ వాటర్ అని రాయడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పోస్టులో తప్పుపట్టింది. ఇది చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఆ ప్రకటనలు ఉన్నాయని ఆహార భద్రత సంస్థ వెల్లడించింది. 100 శాతం క్లెయిమ్స్ అనేవి 2018 ఎఫ్ఎస్ఎస్ అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తన పోస్టులో పేర్కొన్నది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన నోటీసులపై చెకింగ్ చేస్తున్నామని డాబర్ ఇండియా కంపెనీ తన ప్రకటనలో చెప్పింది.