Corona virus | దేశంలో కరోనా వైరస్ (Corona virus) కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,50,19,872కు చేరింది.
ఇక నిన్న ఒక్కరోజే 877 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇంటికి చేరారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4,44,82,770కి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 3,643 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,33,406కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,117) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
Uttar Pradesh | రాత్రి ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు.. తెల్లారేసరికి విగతజీవులుగా మారారు
Alaska Airlines | తప్పు మాదే.. మళ్లీ ఇలా జరగదు : డోర్ ఊడిన ఘటనపై అలాస్కా ఎయిర్లైన్స్
Mohammed Shami | ‘అర్జున’ అందుకోవడం గర్వంగా ఉంది : షమీ