India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 782 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 8,675 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,85,705కి చేరింది. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,45,206 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,824కి ఎగబాకింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Rishi Sunak | ఏడాదిలో రూ.వేల కోట్లు ఆవిరైన సునాక్ దంపతుల సంపద
Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రవుతున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
Barack Obama | ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం