Rishi Sunak | గత ఏడాది యూకే ధనవంతుల జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak ), అక్షత మూర్తి (Akshata Murty) దంపతుల సంపద ఈ ఏడాది తగ్గిపోయింది. గతంతో పోలిస్తే 53 స్థానాలు కిందకు దిగజారారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023’ ( the Sunday Times Rich List 2023) వెల్లడించిన వివరాల ప్రకారం.. రిషి-అక్షత దంపతులు ఏడాదిలో 201 మిలియన్ పౌండ్ల సంపదను కోల్పోయారు.
2022 ఏడాది యూకే ధనవంతుల జాబితాలో రిషి, అక్షత దంపతులు 730 మిలియన్ పౌండ్ల (రూ.7,104 కోట్లు)తో 222వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వారు 275వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం వారి సంపద 529 మిలియన్ పౌండ్లని అంచనా. అంటే రూ.5,448 కోట్లు అన్నమాట. ఈ ఏడాది ఏకంగా రూ.2,069 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇన్ఫోసిస్ (Infosys)లో అక్షత షేర్ల విలువ తగ్గిపోవడంతోనే వారి సంపద కరిగిపోవడానికి కారణమని తెలుస్తోంది.
సునాక్ దంపతుల సింహభాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలోనే ఉంది. సంస్థలో అక్షత మూర్తికి 64 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అయితే, గత ఏడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో సునాక్ దంపతుల సంపద కూడా తరిగిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా, 35 మిలియన్ పౌండ్లతో బ్రిటన్ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబమే తొలి స్థానాన్ని దక్కించుకుంది.
Also Read..
Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రవుతున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
Barack Obama | ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం
Earthquake | పసిఫిక్ మహాసముద్రంలో వరుసగా రెండో రోజూ భారీ భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు