India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజూవారీ కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 400 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 1,08,726 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 405 కొత్త కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో మొత్తం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,49,87,339కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,104 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి 4,44,48,392 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,843కి ఎగబాకింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Rahul Gandhi | అంబాలా టు చండీగఢ్.. ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
Jeff Bezos | ప్రియురాలు లారెన్తో జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్..?
White House | శ్వేతసౌధం వద్ద ట్రక్కు బీభత్సం