నల్లగొండ ప్రతినిధి, ఆగష్టు 15 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే.. తప్పని నాకు చెప్పే బదులు, ఇట్లాంటి పద్ధతి తప్పని పీసీసీ ఛీప్ మహేశ్కుమార్గౌడ్ సీఎం రేవంత్రెడ్డికి చెప్పాలి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు. గురువారం రవీంధ్రభారతిలో మాట్లాడిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నానంటూ మరోసారి రెట్టించారు.
‘నేనేం తప్పు మాట్లాడటం లేదు. పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు చెప్పినా భయపడేది లేదు. చెప్పుకోండి’ అంటూ సవాలు చేస్తున్నట్లుగానే స్పందించారు. శుక్రవారం రాత్రి మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన పలు టీవీ ఛానళ్లతో రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. ఇందులో ఏ మాత్రం తాను వెనక్కి తగ్గది లేదని చెప్పకనే చెప్పారు. మరింత రెట్టిస్తూ… ‘నెంబర్ వన్ పోజిషన్లో ఉన్న సీఎం రేవంత్రెడ్డిది కూడా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ ఉద్యమకారుడా?’ అని పరోక్షంగా ఏకిపారేసారు.
‘ప్రభుత్వంలో నెంబర్ వన్ పోజిషన్లో ఉన్నాయన నుంచి మొదలుపెడితే… ఆయన మంత్రివర్గంలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎంత మంది ఉద్యమకారులు ఉన్నారో… ప్రజలకు, తెలుసు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఉద్యమకారులను గౌరవించాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఇందులో తప్పేముంది?’ అని ఎదురు దాడికి దిగారు. ‘కాంగ్రెస్కు 65 ఎమ్మెల్యేలు ఉన్నరు. పక్కన ఎంఐఎం వాళ్లు ఉన్నరు. సీపీఐ ఉన్నది. ఇక బీఆర్ఎస్ వాళ్లను ఎందుకు తీసుకున్నట్లు’ అని ఫైరయ్యారు. ‘పోచారం స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండు. అట్లాంటి ‘పోచారం’ను ఏట్లా చేర్చుకుంటారు? వచ్చిన ఆయనకు బుద్ధి లేకపోవచ్చు. తీసుకున్నాయకైనా బుద్ధి ఉండాలి కదా?’అంటూ సీఎం రేవంత్రెడ్డికి చురకలు అంటించారు.