IAS vs IPS | కర్ణాటక (Karnataka)లో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణుల మధ్య సోషల్ మీడియా వేదికగా చోటుచేసుకున్న వార్ కొనసాగుతోంది. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ (IPS) అధికారిణి డీ రూప (D Roopa Moudgil) , దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ (IAS) అధికారిణి రోహిణి సింధూరి (Rohini Sinduri) ఒకరినొకరు దూషించుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
ఐఏఎస్ అధికారిణి అయిన రోహిణి సింధూరి.. సీనియర్ ఐఏఎస్ అధికారులకు తన వ్యక్తిగత ఫొటోలను పంపినట్టు ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్ ఆరోపించిన విషయం తెలిపిందే. రూప చేసిన ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న రోహిణి.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఇప్పటికే ఫిర్యాదు చేసింది. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యలకు గానూ నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని రూపకు రోహిణి సింధూరి నోటీసులు పంపింది. నష్ట పరిహారంతోపాటుగా తనకు క్షమాపణలుకు చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. తన ప్రతిష్టకు జరిగిన నష్టం, మానసిక వేదనకు గానూ ఈ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని రోహిణి హెచ్చరించింది.
‘మీరు చేసిన వ్యాఖ్యలు (comments), ప్రకటనలు (statements), ఆరోపణల (allegations) కారణంగా నా క్లయింట్ (client), ఆమె కుటుంబ సభ్యులు (family members) ఎంతో మానసిక వేదనకు గురయ్యారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి. వీటి కారణంగా వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆమె నిజాయితీ, ప్రవర్తన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నా క్లయింట్ పేరు, ప్రతిష్టలకు జరిగిన నష్టాన్ని డబ్బు రూపంలో కొలవలేము. అయినప్పటికీ దీన్ని రూ.కోటి రూపాయలకు పరిమితం చేస్తున్నాం. నష్ట పరిహారం కింద ఈ మొత్తాన్ని మీరు నా క్లయింట్కు చెల్లించాలి’ అని రూప మౌద్గిల్కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read..
IAS vs IPS | ఆ ఇద్దరు మహిళా ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం..!
“IAS vs IPS: ఐఏఎస్ సింధూరి వర్సెస్ ఐపీఎస్ రూపా.. సోషల్ మీడియాలో ఫైట్.. షాకిచ్చిన ప్రభుత్వం”
Earthquake prediction | హిమాలయాలకు పొంచి ఉన్న భారీ ముప్పు.. సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలకు ఛాన్స్!
Mimi Chakraborty | ఎమిరేట్స్ ఎయిర్లైన్స్పై ఎంపీ మిమీ చక్రవర్తి ఆగ్రహం.. కారణం ఏంటంటే.!