Atishi : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో బీజేపీ (BJP) విజయం సాధించి దాదాపు పది రోజులవుతోంది. అయినా ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. దాంతో బీజేపీ తీరుపై ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి (Caretaker CM) అతిషి (Atishi) విమర్శలు గుప్పించారు. వాళ్లు (బీజేపీ నేతలు) ప్రభుత్వాన్ని నడుపుతారో లేదో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు.
‘ప్రభుత్వాన్ని నడుపుతారో లేదో నిర్ణయించుకోండి.. అని నేను బీజేపీని అడగాలనుకుంటున్నా. ఢిల్లీలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం అతిషి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నదని, ఆమెదే బాధ్యత అని చెబుతున్నారు. యుమునా నదిని శుద్ధిచేసే యంత్రాంగం అంతా నదీ తీరానికి వచ్చినప్పుడు మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని చెప్పుకున్నారు. వారి (BJP) ద్వంద్వ వైఖరి వల్లనే వారు ప్రభుత్వాన్ని నడుపుతారో లేదో నిర్ణయించుకోవాలని అంటున్నా’ అని అతిషి అన్నారు.
Devendra Fadnavis | తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. Video
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు