సిమ్లా : ఈడీ, సీబీఐలు అడ్మినిస్ట్రేటివ్ సంస్ధలు కావని, అవి ప్రస్తుతం రాజకీయ సాధనాలుగా మారిపోయాయని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆరోపించారు. ఈడీ, సీబీఐ వంటి ప్రభుత్వ ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ దురుద్దేశాల కోసం వాడుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని సుఖ్విందర్ సుఖు మండిపడ్డారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం కేంద్రం దర్యాప్తు ఏజెన్సీలను ప్రత్యర్ధులపై పురిగొల్పుతోందని అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు చేపడుతున్నాయని ఆరోపించారు. కాగా, రాజకీయ ప్రత్యర్ధులపై మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని విపక్ష నేతలు గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై కాషాయ పాలకులు దాడులు చేయించడం, దర్యాప్తు సంస్ధలను ఉసిగొల్పడం, దేశ ద్రోహుల ముద్ర వేయడం వంటి కుయుక్తులకు తెగబడుతున్నారు. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్ధకు పెనుముప్పు పొంచిఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేతల ఫోన్లను పెగాసస్ సాఫ్ట్వేర్తో ట్రాక్ చేస్తున్నారని ఇదే వేదికపై రాహుల్ ఆరోపించారు.
Read More :
Jasia Akhtar | ఉగ్రవాదుల బెదిరింపులు.. పేదరికం కష్టాలు.. ఇవేవీ ఆమె కలను అడ్డుకోలేదు