గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో శుక్రవారం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. తమ తమ డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు.
60వ డివిజన్లో..
సుబేదారి, ఏప్రిల్ 23 : గ్రేటర్ 60వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం అభినవ్ భాస్కర్ తన తల్లి సబిత, సతీమణి మాధురితో కలిసి శుక్రవారం వడ్డేపల్లి ముదిరాజ్వాడ, కాపువాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ తన తండ్రి ప్రణయ్భాస్కర్ ఆశయ సాధన కోసం బాబాయ్లు చీఫ్విప్ వినయ్భాస్కర్, మాజీ కార్పొరేటర్ విజయ్భాస్కర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తనను ఆదరించి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకుడు శ్రావణ్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు
51వ డివిజన్లో..
అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని 51వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి రంజిత్రావు అభ్యర్థించారు. డివిజన్లో టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డితో కలిసి ఆయన ప్రచారం ప్రారంభించారు. నక్కలగుట్ట, అంబేద్కర్ సర్కిల్, ఎన్జీవోస్కాలనీ-సర్క్యూట్ గెస్ట్హౌస్ రోడ్డులో ఇంటింటికీ తిరిగారు. చీఫ్విప్ వినయ్భాస్కర్ సహకారంతో డివిజన్ను అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్, శ్రీకర్, విప్లవ్రెడ్డి, సబితారెడ్డి, గంగాధర్రాజు, శ్రీధర్రావు పాల్గొన్నారు.
59వ డివిజన్లో..
గ్రేటర్ 59వ డివిజన్లోని ఎక్సైజ్కాలనీ, దుర్గకాలనీ, ఇంద్రనగర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి నీలం పావని ఇంటింటి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రతికాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు నీలం గోపాలకిషన్, బాలరాజు, అరుంధతి, స్వర్ణలత, రవి, రవీందర్రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
5వ డివిజన్లో..
హన్మకొండ చౌరస్తా : గ్రేటర్ పరిధిలోని 5వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాడిశెట్టి విద్యాసాగర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. కళాకారుల డప్పుచప్పళ్లతో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ ప్రచారం పాల్గొని టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బూజుగుండ్ల రాజేంద్రకుమార్, శ్రీరాం శ్యామ్, తాడిశెట్టి మహేశ్, రణధీర్, అనిశెట్టి అరవింద్, అనిశెట్టి జీవన్, మీనయ్య, రాజు పాల్గొన్నారు.
ఒకటో డివిజన్లో..
భీమారం : గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గనిపాక కల్పన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని ఎర్రగుట్ట గుట్ట ప్రాంతంలో మంత్రపురి కాలనీ, పద్మావతి కాలనీ, శ్రీనివాసనగర్ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి, కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో హసన్పర్తి ఎంపీపీ సునీత, ఎనుమాముల మార్కెట్ కమిటీ సభ్యుడు గనిపాక విజయ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి, పెగడపల్లి పీఏసీఎస్ చైర్మన్ చల్లా గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ నరెడ్ల శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు తోట నాగరాజు, మాల దేవేందర్, సుమన్, రమేశ్, భగవన్రెడ్డి, భూపాల్, శంకర్, కిరణ్, ప్రశాంత్, నాగరాజు యాదవ్, రాజేందర్ పాల్గొన్నారు.
30వ డివిజన్లో..
హన్మకొండ : గ్రేటర్ 30వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పొడిశెట్టి స్వప్న అనిల్కుమార్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్నగర్, శ్రీనివాసనగర్, బాలసముద్రం, చిల్డ్రన్స్ పార్కు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ప్రచారంలో డివిజన్ ఇన్చార్జి భరత్కుమార్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు బైరెడ్డి శ్రీనివాస్, కుమార్పల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
53వ డివిజన్లో..
నయీంనగర్ : గ్రేటర్ 53వ డివిజన్లోని లష్కర్ సింగారంలోటీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదా కిరణ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు, ఎండీ సత్తార్, మజర్, భిక్షపతి, సూరి, సాండీ, హైదర్, ఇమ్రాన్, అఫ్రోజ్, వసంత్, వంశీ, రాహుల్, షరీఫ్, నరేశ్, మట్టెడ అనిల్ పాల్గొన్నారు.
25వ డివిజన్లో..
మట్టెవాడ : వరంగల్ 25వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బస్వరాజు శిరీష విస్తృత ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని వేణురావు కాలనీ, బొందలకుంట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం చార్బౌళి ప్రాంతంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బస్వరాజు శ్రీమాన్, మడిపల్లి సుశీల్గౌడ్, మురళీధర్రావు, డీఎస్మూర్తి పాల్గొన్నారు.
14వ డివిజన్లో..
కాశీబుగ్గ : సమష్టి కృషితో 14వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి తూర్పాటి సులోచనను గెలిపించుకోవాలని పర్వతగిరి పీఏసీఎస్ మనోజ్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బాలాజీనగర్లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సులోచన చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, నాయకులు ముడుసు నరసింహ, సిలువేరు శ్రీనివాస్, పత్రి సుభాష్, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్, పసులాది మల్లయ్య పాల్గొన్నారు.
31వ డివిజన్లో..
న్యూశాయంపేట : గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మాడిశెట్టి శివశంకర్ దీన్దయాళ్నగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఓటర్లు ఆయనకు స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు గుండు సదానందం, మల్యాల రమేశ్, కారు ఉపేందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం : రైల్వేశాఖ
ఊరట : యాంటీ వైరల్ డ్రగ్ విరాఫిన్ వాడకానికి డీసీజీఐ ఆమోదం