సూర్యాపేట : రైతుబంధుపై(Rythu Bandhu) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దొంగ నాటకాలు ఆడుతున్నాడు. రైతుబంధుని ఏసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశాడని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి( MLA Jagadish Reddy) ఆరోపించారు. నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గడపగడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల విషయంలో బీఆర్ఎస్ రాజీపడదన్నారు. ఓట్ల రాజకీయం మాకు అవసరంలేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్కి రాయండి మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
యాసంగి సాయం అందకముందే వానకాలం సీజన్ మొదలైంది. రైతుభరోసాపై రేవంత్ ప్రమాణం చేయా లన్నారు. ఇచ్చే ఉద్దేశం లేక కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. రైతుబంధును ఎప్పుడు తాము ఆపమనలేదని స్పష్టం చేశారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతుబంధు ఇక కొనసాగేలా కనిపించ డంలే దన్నారు. రైతులకు ఇదే చివరి రైతుబంధులా కనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కి మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుందని పేర్కొన్నారు. గోదావరి జలాలు తమిళనాడుకు పంచే కుట్ర జరుగుతుందన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి. తడిసిన ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐకేపీల్లో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం వల్లే అకాల వర్షాలకు నష్టం జరుగుతుందన్నారు.