పరకాల, మే 7: బీజేపీ ప్రచార రథానికి ఉన్న చింపేసిన ఘటన నడికూడ మండలం వరికోల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసే వాహనం గ్రామానికి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానాల మధుకర్ అడ్డుకున్నాడు. గ్రామంలో తమ పార్టీ మాత్రమే ప్రచారం చేయాలని, ఇతర ప్రచారం చేయొద్దంటూ దానికున్న ఫ్లెక్సీని చింపేశాడు. దీంతో గ్రామానికి చెందిన కొందరు అతడిని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.