హనుమకొండ సబర్బన్, మే 7: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజినీర్లకు మంగళవారం సూచనలు జారీచేశారు. విద్యుత్ ఉద్యోగులు హెడ్క్వార్టర్లో అందుబాటులో ఉంటూ 24గంటలు సేవలు అందించాలన్నారు. గోదావరి తీర ప్రాంతాలైన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లను తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, షెడ్లలో ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు పెంచాలన్నారు. కార్పొరేట్ కార్యాలయంలో విద్యుత్ నంబర్ 189942 50028 లేదా ఫోన్ చేయాలని తెలిపారు.